Rabies fear: మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కళ్యాణ్లో 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి ‘‘రేబిస్’’ భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుక్కకాటు తర్వాత తనకు ‘‘రేబిస్ ఇన్ఫెక్షన్’’ సోకుతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. కళ్యాణ్ తూర్పులోని టిస్గావ్ నాకా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఆయుష్ విశ్వనాథ్ అమీన్(30)గా గుర్తించారు. ఇతను 8 ఏళ్లుగా భారత్ బ్యాంక్ థానే బ్రాంచ్లో పనిచేస్తున్నారు.
Mahbubnagar: జబ్బు కంటే.. రోగం వచ్చిందన్న మానసిక జబ్బు నరకం చూపిస్తుంది. మహబూబ్ నగర్లో సరిగ్గా ఇదే జరిగింది. తమకు రేబిస్ సోకిందన్న అనుమానంతో ఓ తల్లి చేసిన పనికి కూతురు సైతం ప్రాణాలు కోల్పోయింది. సొంత కూతుర్ను చంపేసిన తల్లి ఆ తర్వాత ఉరేసుకుంది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు యశోద. 2014లో మహబూబ్ నగర్లోని మోనప్ప గుట్ట ప్రాంతంలో నివాసం ఉండే నరేష్తో వివాహమైంది. వారికి ఒక బాబు, పాప…