ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో, సరికొత్త శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు ‘అ!’ అనే థ్రిల్లర్, ‘కల్కి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత “జాంబీ రెడ్డి”తో తొలిసారిగా సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు జాంబీ జోనర్ ను తీసుకొచ్చి థ్రిల్ కలిగించారు. ఈ చిత్రం ఇటీవలే బుల్లితెరపై కూడా టిఆర్పీ పరంగా రికార్డులు సృష్టిస్తోంది.…