PV Sindhu : భారత షెట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి ఈ నెల 22న రాజస్థాన్లో జరగనున్న తన వివాహానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రికి శుభలేఖ అందించి ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ వేడుక నిర్వహించబడింది. ఈ సందర్భంగా సింధు, వెంకట దత్తసాయి పరస్పరం…
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. తనకు కాబోయే భర్తతో ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూ వరులు పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. అలాగే ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. కాగా.. ఆ ఫోటోలను పీవీ సింధు ఈరోజు (శనివారం) సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.