తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా అరికడతామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు అన్నారు. పి.గన్నవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ఫోకస్ మొత్తం గంజాయి పైనే ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉన్నప్పటికీ రవాణా మాత్రం ఇక్కడి నుండే జరుగుతుందన్నారు. ప్రజా రవాణా ద్వారా అక్రమార్కులు గంజాయిని తరలిస్తున్నారని, పోలీసులు అప్రమత్తంగా వుండాలని సూచించారు.…