Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా నేడు రెండో రోజు ప్రభాకర్రావును ప్రశ్నించనుంది. సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీర్బాగ్లోని సీసీఎస్కు తరలించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు? ప్రభాకర్రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్రావు, ప్రణీత్రావు ఇద్దరినీ…
ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు... రేపు బీజేపీ కీలక నేతల స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఎంపీలు ఈటెల, ధర్మపురి, రఘునందన్ రావులకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ ముగ్గురి ఫోన్లతోపాటు... వీళ్ల అనుచరులు, కుటుంబ సభ్యులు, ఎన్నికల సమయంలో వీరికి ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.