Fuel Crisis: ప్రజలు పెట్రోల్, డీజిల్ విషయంలో కంగారు పడొద్దని కేంద్రం సూచించింది. కొరతపై వస్తున్న వదంతులతో ప్రజలు ఆందోళన పడొద్దని కోరింది. దేశంలో రాబోయే 2 నెలలకు (60 రోజులకు) సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఇప్పటికే సిద్ధమైనట్లు పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం నెలకొంది. కానీ ఇప్పటి వరకు భారత్లో మాత్రం అలాంటి పరిస్థితులు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా తప్పుడు ప్రచారం సాగుతుంది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు.
దేశంలో ఇంధన కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై Hindustan Petroleum Corporation Limited (HPCL) కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందని, పెట్రోల్ బంక్ల వద్ద సరఫరా తగ్గుతుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై స్పందించిన HPCL అధికారులు ఈ వార్తలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోల్…