PM Modi: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. భారత్లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. తాజాగా నోయిడాలోని ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. చమురు సంక్షోభానికి చెక్ పెట్టేలా మోడీ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడాలని సూచించారు.