Tamil Nadu: తమిళనాడు ఈరోడ్ జిల్లాలో ఒక ఆలయంలో సింగిల్ నిమ్మకాయకు రికార్డ్ ధర రూ. 13,000 పలికింది. శివరాత్రి పర్వదినాన ఆలయంలో పవిత్రంగా భావించే నిమ్మకాయ కోసం భక్తులు పోటీ పడుతుంటారు. నిమ్మకాయకు ప్రతీ ఏడాది వేలం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే వేలంలో రికార్డ్ ధర పలికినట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.