ఏపీలో ఎన్నికలు రచ్చ రేపుతున్నాయి. వేసవిలో ఎండకంటే.. రాజకీయాల వేడి ఠారెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎండిఓ కార్యాలయంలో ఉన్న ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.…