Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు (జనవరి 25న) మహారాష్ట్రలోని నాందేడ్లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి.. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనం కానున్నారు.
రేపు మహారాష్ట్రలోని నాందేడ్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 8.30కు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి పవన్ బయలుదేరనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమవుతారు. ఉదయం 9.45 గంటలకు నాందేడ్లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.20కు నాందేడ్లోని తఖత్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ జీ గురుద్వారాను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం సిక్కు…