హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వాహనాలను వేగంగా నడపవద్దని అధికారులు చెప్తున్నా జనాలు లెక్కచెయ్యడం లేదు.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది..తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది.. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది.అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..…