షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే జంటగా నటించి 'పఠాన్' సినిమాలోని 'బేషరం రంగ్' పాట వివాదం ఇంకా చల్లారలేదు. ఆ పాటలో దీపిక ధరించిన కాషాయ రంగు బికినీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యకు చెందిన సాధువు ఛవానీ జగద్గురువు పరమహంస ఆచార్య మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.