మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఢాకా వేదికగా ఆదివారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో వన్డేలో వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం, దానిపై బంగ్లాదేశ్ జట్టు తీసుకున్న రివ్యూ కారణంగా రెండు జట్ల మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే ఈ సిరీస్లోని రెండో వన్డే మ్యాచ్లో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ తీవ్ర వివాదానికి దారితీసిన విషయం…