పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే విధంగా సీనియర్ క్రికెటర్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాక్ జట్టు ఎదుర్కొన్న సవాళ్లు, ఫలితాలపై స్పందించారు. పాకిస్తాన్ కొన్ని ప్రధాన ట్రోఫీలు గెలవలేకపోయినప్పటికీ.. ఈ సారి కొత్త ఉత్సాహంతో ఆడేందుకు జట్టు సిద్ధంగా ఉందన్నాడు. ఈ సారి టీ20 వరల్డ్ కప్ గెలిచి పాకిస్తాన్ అభిమానులను సంతోషపెట్టాలని చూస్తున్నాం అని పాకిస్థాన్ కెప్టెన్ చెప్పాడు. సల్మాన్ అలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…