Pakistan Fuel Crisis: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం ప్రపంచానికి ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇతర దేశాలలో యుద్ధం జరుగుతున్నప్పటికీ, దాని తీవ్ర ప్రభావాన్ని పాకిస్థానీ ప్రజలే ఎక్కువగా భరిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించకపోగా, వారిపై బాదుడు షురూ చేసింది. పన్నులను పెంచి, రాయితీలను తగ్గించింది. ఇంధనం, విద్యుత్, ఆహారం మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Pakistan: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామం పాకిస్థాన్ను ఊపిరి ఆడనివ్వని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ప్రపంచ ఇంధన అవసరాలలో 20 శాతం వాటా హోర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నిజానికి ప్రస్తుతం దాయాది దేశం…