Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Fuel Crisis Price Hike Inflation Impact Middle East War

Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!

Published Date :April 3, 2026 , 12:47 pm
By RAMAKRISHNA KENCHE
Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan Fuel Crisis: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచానికి ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇతర దేశాలలో యుద్ధం జరుగుతున్నప్పటికీ, దాని తీవ్ర ప్రభావాన్ని పాకిస్థానీ ప్రజలే ఎక్కువగా భరిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించకపోగా, వారిపై బాదుడు షురూ చేసింది. పన్నులను పెంచి, రాయితీలను తగ్గించింది. ఇంధనం, విద్యుత్, ఆహారం మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

READ MORE: Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

కేవలం కొన్ని వారాల క్రితం, ఇంధన ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. తాజాగా మరోసారి భారం మోపింది అక్కడి ప్రభుత్వం. ఈసారి డీజిల్ ధరలు 54.9% పెరిగి లీటరుకు 520.35 పాకిస్థానీ రూపాయలకు ($1.88) చేరగా, పెట్రోల్ ధరలు 42.7% పెరిగి లీటరుకు 458.40 పాకిస్థానీ రూపాయలకు చేరాయి. ఇంధన ధరలు విపరీతంగా పెరగడం వల్ల, పాకిస్థానీలు అల్లాడుతున్నారు. బస్సు, ట్రక్కు, ఆటో ఛార్జీలు సైతం భారీగా పెంచారు. సరుకు రవాణా, రవాణా ఖర్చులు అధికమవ్వడంతో నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో మరోసారి ద్రవ్యోల్బణం రేటు తారా స్థాయికి చేరుకుంటోంది. జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 5.8 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 7.3 శాతానికి చేరుకుంది. దిగుమతుల వ్యయం పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో పాకిస్థానీ రూపాయిపై ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణం వివరీతంగా పెరగడం కారణంగా రవాణా, విద్యుత్ ఖర్చులు సైతం పెరిగాయి.

READ MORE: Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?

చమురు సంక్షోభం కారణంగా ఇంధన ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మార్చిలో ఎల్‌పీజీ ధర ఒక సిలిండర్‌కు 2,665 పాకిస్థానీ రూపాయలు ఉండగా, ఇప్పుడు అది ఒక సిలిండర్‌కు 3,500 రూపాయలకు చేరుకుంది. ఇది ఒక్క నెలలోనే 900 పాకిస్థానీ రూపాయలకు పైగా పెరుగుదలను సూచిస్తుంది. విద్యుత్ చార్జీలు సైతం తడిచి మోపెడు అవుతున్నాయి. మార్చి 2026 వరకు బిల్లులపై యూనిట్‌కు రూ.1.62 వరకు పెంపును ఆమోదించింది. పాకిస్థాన్‌లో విద్యుత్ టారిఫ్‌లు ఇప్పటికే ఆసియా దేశాల కంటే ఎక్కువగా ఉండగా, ఈ పెంపు మరిన్ని ఇబ్బందులను సృష్టించింది.

READ MORE: Pub Drugs Raid: పబ్ లో ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్..!

అంతేకాదు.. పిండి ధరలు 35 శాతం వరకు పెరిగాయి. 20 కిలోల పిండి బస్తా ధర రూ.2,000కి చేరగా, 1 కిలో ధర ఇప్పుడు రూ.160గా ఉంది. పప్పుధాన్యాల ధరలు రూ.250 నుంచి రూ.450కి పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2 నుంచి 9 శాతం వరకు పెరిగాయి. బంగాళదుంపలు ఇప్పుడు కిలో రూ.50, టమోటాలు కిలో రూ.250, ఉల్లిపాయలు కిలో రూ.80గా ఉన్నాయి. ఈ పెరుగుదలలు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్లు ఏకంగా 10.5 శాతానికి చేరుకున్నాయి. దీనివల్ల గృహ, వ్యాపార, వ్యక్తిగత రుణాల ధరలు పెరిగాయి. దీంతో పెట్టుబడులు మందగించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • food price hike Pakistan
  • global oil crisis impact
  • inflation Pakistan news
  • LPG price Pakistan
  • Middle East war economy

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions