ఆన్ లైన్ లోన్ యాప్.. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఆన్ లైన్ మోసానికి బలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్ లైన్ లోన్ యాప్ లకు దూరంగా వుండండి అంటూ పోలీసులు ఎంతగా చెబుతున్నా.. దానిని పెడచెవినపెడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారు కొందరు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆన్ లైన్ లోన్ యాప్కు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో నివాసముండే యంజల సుధాకర్ బహదూర్ పుర…