గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఇక పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు.. కేంద్రం ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగాను దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ఇంకా మార్పు కనిపించడం లేదు.