ఏ ప్రాజెక్ట్ అడిగినా గడ్కరీ అడ్డు చెప్పరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. మహారాష్ట్ర రవాణా శాఖమంత్రిగా ఉన్నపుడు గడ్కరీ ముంబై, పూణే హైవే నిర్మాణం చేశారని గుర్తు చేశారు. 1997 సమయంలో గొప్ప ప్రాజెక్ట్ నిర్శించారని గుర్తు చేశారు. అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రోడ్లు.. వాజ్పెయి రోడ్లను అభివృద్ధి చేస్తే మోడీ కొనసాగించారన్నారు.
ఈ సభకు వచ్చిన అందరికీ తెలుగులో నమస్కారం చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని దాదాపు రూ. 5వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అమెరికాలో ఉన్న రోడ్ల వెళ్లే అమెరికా రిచ్ అయిందన్నారు.