నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న కేఎంసీ విద్యార్థిని ప్రీతి తాజా ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలోనే కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం హాట్ టాపిక్ గా అయ్యింది. అయితే ఇప్పటికి కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆసుపత్రిలో చేరి మూడురోజులు కావస్తున్న గంట గంటకు ప్రీతి ఆరోగ్యంపై వెలువడుతున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి.
New Director to NIMS: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కి కొత్త డైరెక్టర్ రానున్నారు. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ మనోహర్.. గుండె పోటుతో నాలుగు రోజుల కిందట హైదర్గూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకి ఆ ఆస్పత్రిలోనే సర్జరీ చేయనుండటం, దీనివల్ల దీర్ఘకాలం ట్రీట్మెంట్ పొందాల్సి ఉండటంతో నిమ్స్కి కొత్త డైరెక్టర్ని నియమించకతప్పని పరిస్థితి నెలకొంది.