దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఒక్కరోజు లాభాలు ఆవిరైపోయాయి. నిన్నటి రోజున భారీ లాభాల్లో పుంజుకున్న మార్కెట్.. తాజాగా ఇరాన్తో యుద్ధం కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.
పశ్చిమాసియా (Middle East) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude oil) ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, రూపాయి విలువ పడిపోవడం వంటివి స్టాక్ మార్కెట్ను భారీగా దెబ్బతీశాయి. వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాలను నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో 1,579 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్,…
దేశీయ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మునుపెన్నడూ లేనంతంగా భారీ నష్టాల దిశగా సాగుతోంది. గత నెల ముగింపులో ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం రెండు వారాలైనా చల్లారలేదు.
దేశీయ మార్కెట్ను యుద్ధ భయం వెంటాడుతోంది. గురువారం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అదే ఒరవడి కొనసాగిస్తోంది. త్వరలో పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటించడంతో మంగళవారం కాస్త మార్కెట్ పుంజుకుంది.