Maha Kumbh: మహా కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం చోటు చేసుకుంది. శనివారం బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో కారు డివైడర్ని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు నేపాలీలు మరణించారు. మధుబని నాలుగు లేన్ల బైపాస్లో వేగం వెళ్తున్న కారు, బైక్ని తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడింది. స్టంట్స్ చేస్తున్న బైకర్ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.