Honorarium Increased: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల్లో సేవలందించే నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర దేవాదాయశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నాయీ బ్రాహ్మణులకు నెలలవారీగా అందే భృతిని రూ. 25,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారికి లభిస్తున్న రూ.20,000 కమిషన్ను రూ.25,000కు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ జీవో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు వర్తించనుంది. ఇందులో ప్రతి దేవాలయంలో ఏడాదిలో కనీసం 100 రోజుల…