మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. నిజానికి చెప్పాలంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన విషయం హాట్ టాపిక్గా మారింది అదేమిటంటే.. నయనతార…
టాలీవుడ్లోనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో అత్యంత ఖరీదైన హీరోయిన్గా నయనతార తన స్థానాన్ని పదిలం చేసుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు సినిమాకు 40 నుంచి 50 కోట్లు తీసుకుంటుండగా, నయనతార కూడా వీరితో పోటీ పడుతూ భారీగా సంపాదిస్తోంది. గతంలో నయనతార సినిమాలకు సైన్ చేయడం, షూటింగ్ పూర్తి చేయడానికే పరిమితమైంది. ప్రమోషన్లకు దూరంగా ఉండేది. ‘నేనింతే’ అంటూ భీష్మించుకుని…