యంగ్ హీరో అదిత్ అరుణ్ ఇటీవల త్రిగుణ్ గా తన పేరును మార్చుకున్నాడు. ఈ యేడాదిలో ఇప్పటికే అతను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్లూ’, కథ కంచికి మనం ఇంటికి’ చిత్రాలు విడుదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్ నటించిన ‘కొండా’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఇందులో రాజకీయ నాయకుడు కొండా మురళీగా త్రిగుణ్ నటించాడు. అలానే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే చిత్రంలోనూ త్రిగుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మధుదీప్…