దొంగతనం చేయడం ఆ దొంగకి కొత్త అనుకుంటా. అందుకేనేమో ఆ దొంగ విచిత్రమయిన పద్ధతిని అనుసరించాడు. చేసేది దొంగతనం. అదికూడా అమ్మవారి ఆలయంలోనే. కానీ అమ్మ దయకావాలనుకున్నాడు. అమ్మా అంతా బాగా జరిగేలా చూడు అంటూ అమ్మనే మొక్కుకున్నాడు. తాను చేస్తున్నది దొంగతనమే కానీ అమ్మ దయ కావాలనుకున్నాడు. ఖమ్మంలోని అంకమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆలయానికి దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారికి దండం పెట్టి మరీ చోరీకి ప్రయత్నించాడు.ఈ తతంగం అంతా సీసీ కెమేరాలో…