MS Dhoni’s Instagram Post Goes Viral: బార్బడోస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో పొట్టి కప్ను భారత్ ఒడిసిపట్టింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్ను గెలిచిన టీమిండియాకు రెండో కప్ గెలవడానికి 17 ఏళ్లు పట్టింది. చాలా ఏళ్ల తర్వాత పొట్టి కప్ గెలవడంతో భారతదేశం మొత్తం ఆనందంలో తెలియాడుతోంది.…