తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురు అయింది. మోహన్బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.. రిపోర్టర్పై దాడి కేసులో ఇప్పటికే మోహన్బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోహన్బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగియగా.. తీర్పును నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే మోహన్బాబు ముందస్తు బెయిల్ పిటిషన్…
‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. డిసెంబర్ 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి మోహన్ బాబు చేరుకున్నారు. బుధవారం (డిసెంబర్ 18) సాయంత్రం శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. కలెక్షన్ కింగ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్ట్పై దాడి ఘటనకు…