Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పోటీ చేసి గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు తిరుపతి. ఆరణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసింది ఒకే సీటు అయినా…ఎన్నికల టైంలో… ఆ గెలుపు సౌండ్ మాత్రం రాయలసీమ మొత్తంలో ప్రతిధ్వనించింది. చివరి నిమిషంలో సీటు దక్కినా… 60వేలకు పైగా భారీ మెజారిటీతో ఆరణి విజయం సొంతం చేసుకోవడం గురించి అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ…
ఆరిణి శ్రీనివాసులు... తిరుపతి ఎమ్మెల్యే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్ తెచ్చుకుని భారీ మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆరిణికి టిక్కెట్ ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినాసరే... ఫైనల్గా ఆయనకే ఖరారు చేశారు పవన్కళ్యాణ్.
ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. జనసైనికులు, యువకులు, వీరమహిళలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై.. దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 14 తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇంఛార్జ్లతో సన్నాహత సమావేశాన్ని పార్లమెంట్ సమన్వయ కర్త హోదాలో…
రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నాను తెలిపారు. బలిజలంటే జగన్ కు ద్వేషం.. నాకు గతంలో అండదండగా ఉన్న పెద్దిరెడ్డి నాపై చేసిన విమర్శలను పట్టించుకోను.. ఆయనను విమర్శించే స్దాయి నాకు లేదు.. కానీ, నాపై విమర్శలు చేస్తున్న ప్రస్తుత వైసిపీ అభ్యర్ధికి భవిష్యత్తులో సమాదానం చెబుతాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.