3 Minors Among 5 Of Family Killed After Fire Breaks Out In UP: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలోని మౌ జిల్లాలోని షాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. అగ్నిప్రమాదం విషయం తెలిసిన అధికారులు వెంటనే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.