చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయాందోళలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా తమిళ్ డైరెక్టర్ ఎం.త్యాగరాజన్ మృతి చెందారు. రోడ్డుపక్కన అనాథ శవంలా ఆయన మృతదేహం పడిఉండడం మనసును కలిచివేస్తోంది. కోలీవుడ్ లో విజయ్ కాంత్, ప్రభు లాంటి హీరోలతో ‘వెట్రి మేల్ వెట్రి’, ‘మానగంకావల్’ సినిమాలను తెరకెక్కించిన ఎం.త్యాగరాజన్ గురువారం ఉదయం ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డుపక్కన శవంలా కనిపించారు. ఆయనను పలువురు స్థానికులు గుర్తుపట్టడంతో ఈ విషయం…