గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.
భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లపై నుంచి సహాయం చేయాలని కోరుతున్నారు. ఇక, వరంగల్- హన్మకొండ మధ్య కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. అయితే, హంటర్ రోడ్డులోని ఓ లేడీస్ హాస్టల్ లో 200 మంది విద్యా్ర్థినీలు చిక్కుకున్నారు.