సినీరంగంలో కథానాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే కృష్ణంరాజు రాజకీయ అరంగేట్రమ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్న ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నర్సాపురం నియోజకవర్గం నుండి 1992లో లోక్ సభ స్థానానికి పోటీ చేసి కృష్ణంరాజు ఓటమి పాలయ్యారు. దాంతో తనలాంటి సున్నిత మనస్కుడికి రాజకీయాలు పనికి రావనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే హైదరాబాద్ లో బీజేపీ నేతలు నరేంద్ర, విద్యాసాగరరావుతో ఉన్న అనుబంధంతో, వారి ప్రోద్భలంతో మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు…