HYD ATM DONGALU: ATMలో కాల్పులు జరిపి అలజడి సృష్టించిన ఇద్దరు దొంగలు దొరికేశారు. అటు ఏటీఎంలలో క్యాష్ నింపే ఉద్యోగం చేస్తూ డబ్బు కొట్టేసిన కేటుగాడ్నీ పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు కేసుల్లో భారీగా క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలోని ఏటీఎం వద్ద జరిగిన కాల్పులు.. ఆ తర్వాత జరిగిన దోపిడీ కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.