మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కోదండరామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల వారి కల్యాణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఆలయ చైర్మన్ రేణిగుంట్ల శ్రీనివాస్ , ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.