టీ20 వరల్డ్కప్ 2026లో భారత్తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్కు పాకిస్థాన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ ఆడడం లేదని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఏదేమైనా పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత రాజకీయ, క్రీడా వర్గాల్లో…