రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహారాష్ట్ర ముఠా రెచ్చిపోయింది. కూలి పనుల కోసం మనుషులను పంపిస్తానని చెప్పి ఓ వ్యక్తి లక్ష రూపాయులు అడ్వాన్స్ తీసుకున్నాడు. తీరా కూలీలను పంపకపోవడంతో మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది గుర్తుతెలియని వ్యక్తులు మేస్త్రి ఇంటికి వచ్చి అతని తల్లిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.