OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ చెప్పుకోతగ్గ బలం ఉందని అంటారు. పార్టీ పునాదుల బలం కావచ్చు, సామాజిక సమీకరణల లెక్కలు కావచ్చు. కారణం ఏదైనా…. ఇక్కడ గెలుపు ఓటముల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కీలకం అన్నది రాజకీయవర్గాల విస్తృతాభిప్రాయం. అందుకు తగ్గట్టే ఏపీలో ఏం జరిగినా…. ఇక్కడి టీడీపీ అభిమానులు రియాక్ట్ అవుతుంటారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలు సైతం ఉమ్మడి ఖమ్మంలో ఘనంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే……
వైఎస్ షర్మిల ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటిస్తానని చెప్పారు. ఇక నిరుద్యోగుల కోసం ఆమె ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షకు దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే రాష్ట్రంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల…