పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశ జనవరి 31, 2025న ప్రారంభమై ఫిబ్రవరి 13, 2025న ముగుస్తుంది. యూనియన్ బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను నిర్దేశించేది. దేశ జీడీపీ వృద్ధి మందగిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని…