బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ భారీ స్థాయిలో కార్యాచరణకు సిద్ధమైంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. గ్రామ, మండల, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కో చోట ఒక్కో కార్యక్రమం ఉండేలా ప్లాన్ రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అధినేత…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నంది నగర్లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటల లోపు నంది నగర్ నివాసానికి చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.…