తెలుగు సాహితీ క్షేత్రాన్ని తన రచనలతో సుసంపన్నం చేశారు కవిస్రమాట్ విశ్వనాథ సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరిస్తే, సాహితీ రంగం ఆయనను జ్ఞానపీఠంపై కూర్చోపెట్టింది. 1895లో జన్మించి, 1976లో కన్నుమూసిన విశ్వనాథ సత్యనారాయణను ఈ తరం సాహితీ కారులూ నిత్య స్మరిస్తుంటారంటే ఆయన రచనల ప్రభావం ఎలాంటిదో అర్థమైపోతుంది. తెలుగు సాహితీ రంగంలో విశ్వనాధ స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి కవిసమ్రాట్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ప్రముఖ నటుడు,…