స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోని అడవుల్లో మంటలు కలకలం కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నిన్నటి (శనివారం) వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్చిచ్చు దాదాపు 11 వేల ఎకరాల విస్తీర్ణం వరకు ఈ మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని స్పెయిన్ అధికారులు చెబుతున్నారు.