పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలపై ఇరాన్తో చర్చించినట్లుగా ఎక్స్లో జైశంకర్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కీలక భాగస్వాములతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కృషి చేస్తోంది. ప్రతి దేశానికి సంయమనం, దాడులను ఆపడం, చర్చలు కొనసాగించడం అత్యంత అవసరమని భారత్ అభిప్రాయపడింది. సంక్షోభం మరింత…
Israel Iran: ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని ప్రపంచం భయపడుతోంది. శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్స్ని హతమార్చింది.