టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి. రింకూను దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. రింకూను బెదిరించిన నిందితులను పోలీసులు విచారించగా.. ఈ విషయం బయటపడింది. మొహమ్మద్ దిల్షాద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. 2025 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య…