Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఒక ప్రైవేట్ ప్రయాణికుల బస్సు 400 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో 12 మంది మరణించారు, మరో 35 మంది గాయపడ్డారు. సిర్మా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన హరిపుర్ధార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సు ఏటవాలుగా ఉన్న రోడ్డుపై నుంచి బస్సు జారిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు సోలన్ నుంచి రాజ్ఘడ్, హరిపుర్ధార్ మీదుగా కుప్వీకి వెళ్తోంది. Read Also: Mahindra…
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. భికియాసైన్ – వినాయక్ రోడ్డులో ఒక ప్రయాణీకుల బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. READ ALSO: Lottery Ticket: అన్నదాతకు జాక్పాట్.. రూ.7 లాటరీ టికెట్తో రూ.కోటి గెలుపు పలు నివేదికల…
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 10 రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు.