Uddhav Thackeray: ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్కు సంబంధించి శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. మ్యాచ్ను వీక్షించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. థాకరే ప్రకటన రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి, పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇంతలో, ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీనిపై ప్రతిపక్షాలు…
ICC Fines SuryaKumar Yadav: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ ప్రకటన రాజకీయ ప్రేరేపితమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఫిర్యాదు చేసింది.