ఇంగ్లండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 13 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు మంగళవారం కామన్వెల్త్ క్రీడల్లో పసిడి మోత మోగించారు. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన అమ్మాయిలు లాన్బౌల్స్ ఫోర్స్ విభాగంలో చారిత్రాత్మక విజయంతో తొలి స్వర్ణాన్ని అందించారు.
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు పతకాల పంట కొనసాగుతోంది. భారత హెవీ వెయిట్లిఫ్టర్ వికాస్ ఠాకూర్ 96 కేజీల విభాగంలో రజతం సాధించి భారత్ పతకాల పంటలో మరో పతకాన్ని జోడించాడు.
ఇంగ్లాండ్లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్లో భారత్కు తొలి పతకం వచ్చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ బంగారు పతకంతో భారత్ మొత్తానికి నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లెంది.
ఇంగ్లండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్లిఫ్టింగ్లోనే మూడు స్వర్ణాలు దక్కటం విశేషం. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటుతున్నారు. ఈ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు స్వర్ణాలు భారత్ తన ఖాతాలో వేసుకోగా.. ఆ మూడు కూడా వెయిట్లిఫ్టింగ్లో వచ్చినవే కావడం గమనార్హం.