Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటను ముత్తాఖీ వచ్చిన రోజే కాబూల్పై వైమానికి దాడికి తెగబడింది.
Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025లో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) విదేశీ దేశాలకు సహాయం కోసం రూ. 5,483 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది రూ. 5806 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువ. విదేశాంగ శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ. 20,516 కోట్లుగా ఉంది. దీని నుంచే మన పొరుగు, మిత్ర దేశాలకు భారత్ సాయాన్ని అందిస్తోంది.