హైదరాబాద్ లో బిర్యానీ హోటల్స్ లో మొదలైన చిన్న తనిఖీ, దేశవ్యాప్తంగా దాదాపు రూ.70 వేల కోట్ల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టింది. చాలా హోటళ్లు భారీగా లాభాలు సంపాదిస్తున్నా, ప్రభుత్వానికి మాత్రం తక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇలా పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం, గత కొన్నేళ్లుగా ఇలా దాదాపు రూ.70వేల కోట్ల దాకా పన్ను ఎగవేత జరిగినట్లు తెలుస్తోంది. హోటళ్లలో బిల్లులు వేయడానికి ఉపయోగించే ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఈ…