హైదరాబాద్ నగరవాసులకు మరో అద్భుతమైన ఆహ్లాదకర ప్రాంతం అందుబాటులోకి రానుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉండి.. గతంలో ఆక్రమణల కోరల్లో చిక్కుకున్న బమృకున్-ఉద్-దౌలా చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పునరుద్ధరించిన చెరువును ప్రారంభించి.. ప్రజలకు అంకితం చేయనున్నారు. హైడ్రా కమిషనర్ ఏర్పాట్ల పరిశీలన.. ముఖ్యమంత్రి పర్యటన, ప్రారంభోత్సవ వేడుకల నేపథ్యంలో.. శనివారం ఉదయం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో…